ఏపీలో రైతు రుణమాఫీ జీవో రద్దు

ఏపీలో రైతు రుణమాఫీ జీవో రద్దు

అమరావతి, వెలుగు: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నిధుల చెల్లింపు జీవోను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులిచ్చారు. దీంతో రైతులకు చెల్లించాల్సిన 4, 5వ విడత రుణమాఫీ చెల్లింపులకు బ్రేక్ పడినట్లైంది. టీడీపీ ప్రభుత్వంలో 10 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సిన రుణమాఫీ రూ. 8 వేల కోట్లకు చేరాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తమపై కక్ష్య సాధించేందుకు రుణమాఫీ  ఆపి రైతుల్ని నట్టేట్లో ముంచారన్నారు.