
రాష్ట్రంలో దాదాపు 20 వేల వరకు టీచర్పోస్టులు ఖాళీగా ఉంటే.. ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్జారీ చేసింది. నిరుడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్మాట్లాడుతూ..13,086 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కానీ తీరా చూస్తే 5 వేల పోస్టులకు నోటిఫికేషన్వచ్చింది. కనీసం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల తర్వాత మిగిలిన ఖాళీలనైనా నింపాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే.. విద్యాశాఖ మంత్రి అభ్యర్థుల ఆందోళనకు రాజకీయ రంగు పులిమి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడే ఖాళీలు తర్వాత భర్తీ చేస్తామని చెప్పారు. మరో రెండు నెలల్లో ప్రభుత్వం చివరి దశలో ఉండగా ప్రమోషన్ ద్వారా ఏర్పడే ఖాళీలు భవిష్యత్ లో భర్తీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదం.
33 జిల్లాల ఉద్యోగార్థులకు న్యాయం జరగాలంటే అసెంబ్లీలో సీఎం కేసీఆర్చెప్పిన లెక్కల ప్రకారం13,086 టీచర్ పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్ఇయ్యాలి. ఇప్పుడు చేపడుతున్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియలో ఖాళీ అయ్యే 10 వేల టీచర్ పోస్టులను ఇప్పుడే డీఎస్సీలో కలపాలి. ఇందులో 6 వేల ప్రైమరీ టీచర్ పోస్టులు మిగతా 4 వేలు ఉన్నత పాఠశాల టీచర్ పోస్టులు ఉన్నాయి. అన్నీ కలిపి15 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే 4 లక్షల మంది అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. ఎన్నికల కోడ్ లోపే మిగత టీచర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి నోటిఫికేషన్ లో జత చేయాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2017 లో 8792 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి నుంచి మళ్లీ రిక్రూట్మెంట్లేదు. గత 7 ఏండ్లుగా వేల మంది పదవీ విరమణ పొందినా, ఆ ఖాళీలు ఇప్పుడు చూపలేదు. 5089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల.. అటు స్కూళ్లలోనూ పూర్తి స్థాయిలో ఖాళీలు భర్తీ కావు, ఇటు ఉద్యోగార్థులకూ న్యాయం జరగడం లేదు కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచించి.. సానుకూల నిర్ణయం తీసుకోవాలి.
- రావుల రామ్మోహన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం