స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి .. డీఎస్సీ 2024 అభ్యర్థుల ఆందోళన

స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి .. డీఎస్సీ 2024 అభ్యర్థుల ఆందోళన
  • అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వండి

బషీర్​బాగ్, వెలుగు: డీఎస్సీ 2024 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ లక్డికాపూల్​లోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం ముందు పలువురు అభ్యర్థులు నిరసనకు దిగారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులను పక్కనపెట్టి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు ఉద్యోగాలు కేటాయించారని ఆరోపించారు. పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ర్యాపిడో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని వాపోయారు. 

వారం రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి, అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌‌కు తరలించారు.