
- బల్దియా కమిషనర్ను కోరిన బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు పర్మిషన్ఇవ్వాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు తుంగ బాలు కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అందుబాటులో లేకపోవడంతో, కమిషనర్ ఓఎస్డీ వేణుగోపాల్ను కలిసి అప్లికేషన్అందజేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతి ఇవ్వాలని అప్లికేషన్సమర్పించినట్లు వారు వివరించారు. జూన్2న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ర్యాలీ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొంటారని చెప్పారు..