
అమెరికాలోని మిచిగాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్, నేరేడ్ మెట్కు చెందిన ఇంద్రారెడ్డి కూతురు చరితా రెడ్డి చనిపోయారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్లిన చరితా రెడ్డి(25) ఎంఎస్ పూర్తి చేసి, డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అక్కడే పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం చరితారెడ్డి కారులో ప్రయాణిస్తుండగా మిచిగాన్ లోని కూపర్స్ విల్లే దగ్గరలో వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చరితా రెడ్డి కోమాలోకి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు ఆమెను ముస్కేగోన్ లోని మెర్సీ హెల్త్ క్యాంపస్ కు తరలించగా..ఆదివారం ట్రీట్ మెంట్ పొందుతూ చరితా రెడ్డి చనిపోయారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మందు తాగి కారు నడుపుతున్నట్లుగా మిచిగాన్ పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చరితా రెడ్డి డెడ్ బాడీని హైదరాబాద్కు తీసుకురావడానికి ఆమె బాబాయ్ అమెరికా వెళ్లారు. బాడీని తీసుకురావడానికి వారం రోజులు పట్టోచ్చని ఆయన తెలిపారు.