అసెంబ్లీని అగౌరవపరచొద్దు : మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీని అగౌరవపరచొద్దు : మంత్రి శ్రీధర్ బాబు
  • కేటీఆర్ 'సర్కస్' కామెంట్లపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్

హైదరాబాద్, వెలుగు: జీఎస్టీ అమెండ్​మెంట్​బిల్లు ప్రవేశపెట్టే సందర్భంలో కేటీఆర్​, మంత్రి శ్రీధర్​బాబు మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రి జూపల్లి కృష్ణా రావును స్పీకర్​ కోరారు. అయితే, ఆ సమయంలో మంత్రి సభలో లేకపోవడంతో కేటీఆర్.. ఇది సర్కార్​ కాదని, సర్కస్​నడుపుతున్నారని విమర్శించారు. బిల్లు వివరాలేంటో చెప్పాలని డిమాండ్​చే శారు. 

మంత్రి సిద్ధంగా లేరా అంటూ ఓ వైపు స్పీకర్​ మాట్లాడుతుండగానే ఆయన కామెంట్​చేస్తుండడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబు జోక్యం చేసుకున్నారు. సభను కొంచెం హద్దులో పెట్టాలని స్పీకర్​ను ఆయన కోరారు. స్పీకర్ పనులనూ వాళ్లే డిసైడ్​చేస్తున్నారని మండిపడ్డారు.