చెరువులో కారు పడి ముగ్గురి మృతి

చెరువులో కారు పడి ముగ్గురి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారు. సర్నేని గూడెం సర్పంచ్ దర్నే రాణి భర్త దర్నే మధు, కుమారుడు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డి చనిపో యారు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వీళ్లు తిరుగు ప్రయాణంలో వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం నుంచి వీరంతా కనిపించకపోయేసరికి మధు భార్య రాణి, గ్రామస్తులతో కలిసి వెతికింది. కానీ, ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెల్లంకి సీసీ టీవీ ఫుటేజీ ద్వారా కారు చెరువులో పడినట్లు గుర్తించారు. దాంతో గ్రామస్తులతో కలిసి చెరువులో వెతకగా కారు బయటపడింది. కారులో వెళ్లిన ముగ్గురు కారులోనే మృతదేహాలుగా తేలారు. నిన్న శివరాత్రి సందర్భంగా గ్రామంలోని గుడి వద్ద పలు కార్యాక్రమాలు చేయించిన మధు ఇంతలోనే మరణించడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న నకిరేకల్ ఎమ్యెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గరుండి సహాయకచర్యలు చేపట్టారు.

For More News..

మీడియాకు షాకిచ్చిన కర్ణాటక అసెంబ్లీ స్పీకర్

ట్రంప్ కల నిజమవ్వాలంటే పక్కన సన్నీలియోన్‌ ఉండాలి

కులం పేరు రాయలేదని స్కూల్ అడ్మిషన్ క్యాన్సిల్