 
                                    పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. ఫైర్ సిబ్బంది కారును బడయటకు తీసి, మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. మృతులు కప్పిశెట్టి సురేష్, చింత చిట్టియ్య, చౌధుల కాశీగా తెలుస్తోంది. బాధితులు కారులో కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తుండగా.. ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 
         
                     
                     
                    