మేడ్చల్ వద్ద కారు పల్టీ.. ముగ్గురి మృతి

మేడ్చల్ వద్ద కారు పల్టీ.. ముగ్గురి మృతి

హైదరాబాద్: మేడ్చల్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పల్టీ కొట్టి ఇతర వాహనాలపైకి దూసుకెళ్లి బీబత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు సమాచారం. రెప్పపాటులో జరిగిన ప్రమాదంతో మేడ్చల్ శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. షాక్ నుండి కోలుకున్న స్థానికులు గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియలేదు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.