కేర్ టేకర్ దొంగ అరెస్ట్ ..హిమాయత్ నగర్ చోరీని ఛేదించిన పోలీసులు

కేర్ టేకర్ దొంగ అరెస్ట్ ..హిమాయత్ నగర్ చోరీని  ఛేదించిన పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు: దోమలగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలోని హిమాయత్​నగర్​ స్ట్రీట్​ నంబర్​ 6లో అక్టోబర్ 12న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. హెరిటేజ్ అపార్ట్​మెంట్స్​లో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో కేర్​టేకరే దొంగ అని పోలీసులు తేల్చారు. శుక్రవారం వివరాలను డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. 

వృద్ధ దంపతులు తమ ఇంట్లో ఏపీలోని కృష్ణ జిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన గోవర్ధన్​ను కేర్​టేకర్​గా నియమించుకున్నారు. అతడే వారిపై దాడి చేసి చోరీకి పాల్పడ్డాడు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేసినట్లు డీసీపీ తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను కంకిపాడు ముతూట్​ ఫైనాన్స్​లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపినట్లు వెల్లడించారు.