మట్టిలో చిన్నారుల క్యారమ్స్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా

మట్టిలో చిన్నారుల క్యారమ్స్ అద్భుతం: ఆనంద్ మహీంద్రా

మహీంద్ర గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక సేవ చేయడంలో తన వంతు సాయం అందించడంతో పాటు… సమాజం కోసం పాటు పడేవారికి అండగా నిలుస్తున్నారు. అంతేకాదు యువతలో స్ఫూర్తిని నింపేలా క్రియేటివిటీతో చేసే పనులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మరోసారి ఆనంద్ మహీంద్రా  చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కొందరు పేద పిల్లల క్రియేటివిటీకి ఫిదా అయ్యారు. ‘నా వాట్సాప్ వండర్ బాక్స్ లో ఇవాళ ఉదయం ఓ అద్భుతమైన ఫొటో చూశాను. భారత్ లో ఊహాశక్తికి ఎటువంటి కొదవలేదన్న విషయాన్ని ఇది రుజువు చేస్తోంది’ అని ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.

కొంతమంది పిల్లలు క్యారమ్స్ ఆడుతుండడం ఈ ఫొటోలో ఉంది. అయితే..వారు ఆడుతున్న క్యారమ్ బోర్డ్ చెక్కతో చేసింది కాదు. మట్టిని చదునుగా చేసి… అచ్చం క్యారమ్ బోర్డులా చేసుకుని ఆ పేద పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక క్యారమ్స్ డిస్క్ లకు బదులుగా సీసాల మూతలను ఉపయోగించారు.