రాష్ట్రంలో కొత్తగా 682 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 682 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 682 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,74,540కు చేరింది. 1,477 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 7,696 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,65,367 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.