
బషీర్ బాగ్, వెలుగు: వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా కారణమంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీసీసీ వైస్ప్రెసిడెంట్ మల్లు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణ స్వామిపై సోమవారం బేగంబజార్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. వైఎస్సార్ సోనియాకు విధేయుడుగా ఉండేవా రని గుర్తుచేశారు. 2004, 2009 రెండు సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. నారాయణ స్వామి రాజకీయ స్వలా భం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.