![బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు](https://static.v6velugu.com/uploads/2024/05/61_6WQjITOfHw.jpg)
పంజాగుట్ట, వెలుగు: పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఓటర్లకు బీజేపీకి ఓటు వేయాలని చెప్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రహమత్నగర్లోని న్యూటన్ హైస్కూల్వద్ద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతుండగా, ఇక్కడి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న కూకట్పల్లికి చెందిన బీజేపీ స్టేట్ మీడియా కో-ఆర్డినేటర్ విజ్జిత్ వర్మ తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారని పోలీసులు తెలిపారు. తాను వెంగళరావు నగర్ డివిజన్ బీజేపీ ఇంచార్జీగా ఉన్నానని ఆయన చెప్పారని, కానీ అందుకు సంబంధించి ఎలాంటి పాస్, డాక్యుమెంట్లు ఆయన వద్ద లేవన్నారు. హెచ్సీ మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.