కొత్త సచివాలయం నిర్మాణానికి, పాత సచివాలయం కూల్చివేతకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో జూన్ 29 న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 1966 నుంచి 2012 వరకు ఈ భవనాలను నిర్మించారు. వీటికి మరో 70 ఏళ్ల జీవితకాలం ఉంది. కూల్చివేత నిర్ణయంపై పిటిషనర్ ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 2016 లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా జూన్ 29 న పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పాత భవనాలు కూల్చి, కొత్త భవనాలు నిర్మించడం ద్వారా సుమారు రూ . 100 కోట్ల మేర ప్రజాధనం వృథా అవుతోంది. దీనిని నివారించేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించాం. ” అని పిటిషన్ లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభమయ్యాయని , తక్షణమే జోక్యం చేసుకొని హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని జీవన్ రెడ్డి అభ్యర్థించారు.
వెయ్యి కోట్ల ప్రజాధనం వృథా.. సచివాలయ నిర్మాణంపై సుప్రీంలో పిటిషన్
- తెలంగాణం
- July 11, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!