కమలాపూర్, వెలుగు : హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఎన్నికల్లో తనను గెలిపించకపోతే తన భార్య, కూతురితో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని మంగళవారం కమలాపూర్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే డిసెంబర్ 3న జైత్రయాత్ర ఉంటుందని, లేకపోతే డిసెంబర్ 4న తన శవయాత్రకు రావాలని అన్నారు.
కోడ్ ఉల్లంఘనల కింద ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. దీనిపై విచారణకు చేయాలని హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేసిన కమలాపూర్ ఎంపీడీఓ రవి రిటర్నింగ్ ఆఫీసర్కు రిపోర్ట్ చేశారు. ఆర్వో ఆదేశాల మేరకు ఎంపీడీఓ హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.