జూబ్లీహిల్స్,వెలుగు: ట్రాఫిక్ఎస్ఐని తిట్టిన యువకుడిపై జూబ్లీహిల్స్పీఎస్ లో కేసు నమోదైంది. ఎస్ఐ రాకేశ్తెలిపిన ప్రకారం.. ఎస్సార్నగర్ట్రాఫిక్ పోలీసులు సోమవారం యూసుఫ్గూడ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బైక్ పై వస్తున్న యువకుడు ఆంజనేయులును ఎస్ఐ నరేశ్ఆపారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని అడిగి.. యువకుడి బైక్ పై పెండింగ్ చలాన్లు ఉండగా కట్టాలని అతనికి ఎస్ఐ సూచించాడు.
దీంతో “ నా గురించి నీకు తెలియదు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో అడుగు.. చెబుతారు’’ అంటూ యువకుడు తిట్టినట్టు ఎస్ఐ నరేశ్జూబ్లీహిల్స్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంజనేయులును అదుపులోకి తీసుకుని ఐపీసీ 353,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాకేశ్ తెలిపారు.