నిర్మాత కమల్ కిశోర్ పై కేసు నమోదు

నిర్మాత కమల్ కిశోర్ పై కేసు నమోదు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రాపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. కారుతో ఢీ కొట్టాడని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 279  & 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. 

తాను మిశ్రా కోసం వెతుకున్న సమయంలో నివాస భవనం వద్ద పార్కింగ్ ప్లేస్ లో కారు కనిపించిందని ఆమె పోలీసులకు తెలిపారు. కారులో మిశ్రా మరో మహిళతో ఉన్నాడని, తాను కారును ఆపేందుకు ప్రయత్నించగా.. ఆపకుండా తనపైకి పోనిచ్చాడని చెప్పింది. ఈ ఘటనలో మిశ్రా భార్య కాళ్లు, తలకు గాయాలయ్యాయి. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.