కొండగట్టు దగ్గర మంత్రులను అడ్డుకున్నవారిపై కేసులు

కొండగట్టు దగ్గర మంత్రులను అడ్డుకున్నవారిపై కేసులు

జగిత్యాల జిల్లాలో మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులపై కేసులు పెట్టారు పోలీసులు. కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేటలో  శుక్రవారం నాడు గ్రామ సభకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ వెళ్లారు. మంత్రులు వస్తున్నారనే సమాచారంతో…. హిమ్మత్ రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లి గ్రామాలకు చెందిన వారు… వారి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. కొండగట్టు ప్రమాదం జరిగి ఇప్పటికే ఏడాది గడిచినపోయినా… మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందలేదని.. వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని డిమాండ్ చేశారు. పోలీసులు, నాయకులు కోరినా.. గ్రామస్తులు అలాగే బైఠాయించారు. చాలాసేపటికి.. మంత్రులు డిమాండ్లు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో.. అక్కడి నుంచి గ్రామస్తులు వెళ్లిపోయి మంత్రులకు దారిచ్చారు. తిరుగు ప్రయాణంలో మంత్రులు వేరే దారిలో జగిత్యాలకు చేరుకున్నారు.

ఐతే.. మంత్రులను అడ్డుకోవడాన్ని కొడిమ్యాల పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇదే కారణంతో ఎనిమిది మంది గ్రామస్తులపై కేసులు పెట్టారు కొడిమ్యాల పోలీసులు.