రియాకు రక్షణ కల్పించాలంటూ ముంబై పోలీసులకు సీబీఐ లేఖ

రియాకు రక్షణ కల్పించాలంటూ ముంబై పోలీసులకు సీబీఐ లేఖ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ విచారిస్తోంది. ఇవాళ(శనివారం) రెండో రోజు ఆమె విచారణ కొనసాగుతోంది. మరోవైపు రియాకు, ఆమె కుటుంబానికి ముప్పు ఉందని, వారికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. ఆమె ఇంటి దగ్గర పెద్ద సంఖ్యలో మీడియా ఉంటోందని, ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు కూడా మీడియా వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని లేఖలో తెలిపింది. దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ రక్షణ కల్పిస్తామని చెప్పారు.