- 91.46శాతం పాస్ పర్సెంటేజ్
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదోతరగతి రిజల్ట్స్ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్సైట్లో ఉంచారు. ఉమాంగ్ యాప్, టోల్ఫ్రీ నంబర్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది పాస్అయినట్లు అధికారులు వెల్లడించారు. పోయిన ఏడాది కంటే ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ పెరిగింది. దాదాపు 41,804 మంది స్టూడెంట్స్ 95శాతం మార్కులు స్కోర్ చేశారు. సీబీఎస్ఈ ఇప్పటికే ట్వెల్త్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. కరోనా కారణంగా టెన్త్, 12 ఎగ్జామ్స్ను మధ్యలోనే రద్దు చేశారు. సీబీఎస్ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ను cbseresults.nic.inలో చూసుకోవచ్చు.