పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన సీబీఎస్ఈ

పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన సీబీఎస్ఈ

లాక్డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన‌ 10,12 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల షెడ్యూల్ ను సీబీఎస్ఈ ప్రకటించింది. ఈ ప‌రీక్ష‌ల‌ను జూలై 1 నుంచి 15వ తేదీల మధ్యన నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు తెలిపింది. పరీక్షలను ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజరును తెచ్చుకోవాలని సీబీఎస్ఈ బోర్డు సూచించింది. పరీక్ష హాలులోకి వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థి ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని తెలిపింది. ప్రతి విద్యార్థి ముక్కును, నోటిని మాస్కుతో కవర్ చేసుకోవాలిని ఆదేశించింది. బోర్డు పెట్టిన నియమాలను ప్రతి విద్యార్థి పాటించాలని చెప్పింది.

For More News..

తెలంగాణలో రేపటి నుంచి బస్సు సర్వీసులు!

స్టాక్ మార్కెట్ నష్టాలతో గవర్నమెంట్ టీచర్ సూసైడ్

కరోనా కోసం ఆయుష్ టాస్క్‌ఫోర్స్