CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్‌ బోర్టు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. 500 మార్కులకు గాను 499 మార్కులను తెచ్చుకున్న 13 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నారు. 498 మార్కులను సాధించిన 24 మంది రెండో ర్యాంకును దక్కించుకున్నారు. 497 మార్కులతో 58 మంది విద్యార్థులు మూడో ర్యాంకును సాధించారు.

10వ తరగతి పరీక్షలకు మొత్తం 17.6 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 91.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 99.85 శాతం ఉత్తీర్ణతతో త్రివేండ్రం మొదటి స్థానంలో నిలవగా… 99 శాతంతో చెన్నై, 95.89 శాతంతో అజ్మీర్ రీజియన్లు తర్వాత రెండు స్థానాల్లో నిలిచాయి.ఈ ఫలితాలను బోర్డు వెబ్‌సైట్ cbseresults.nic.in, cbse.nic.in లో చూసుకోవచ్చు.

ప్రతి ఏటా ఫలితాలను విడుదల చేస్తున్న సమయం కంటే ముందుగానే ఈసారి ఫలితాలను విడుదల చేశామని బోర్డు ప్రకటించింది. దీంతో ఉన్నత చదువుల అడ్మిషన్ల విషయంలో విద్యార్థులకు తగినంత సమయం లభిస్తుందని తెలిపింది.