CBSE కీలక నిర్ణయం: పరీక్షలలో నో గ్రేడ్స్..నో మార్క్స్ పర్సెంటేజ్..

CBSE  కీలక నిర్ణయం:  పరీక్షలలో నో గ్రేడ్స్..నో మార్క్స్ పర్సెంటేజ్..

10వ తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి CBSE కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 10, 12 వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల్లో మార్కుల శాతం, గ్రేడ్ లు ఇవ్వబోమని సీబీఎస్ఈ  ప్రకటించింది. 

ఉన్నత విద్య, ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే అడ్మిషన్ పొందిన సంస్థ లేదా యజమాని ద్వారా గణన చేయవచ్చని సీబీఎస్ ఈ ఎగ్జామినర్ తెలిపారు. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల శాతాన్ని లెక్కించే ప్రమాణాలపై స్పష్టత కోరుతూ వచ్చిన వివిధ అభ్యర్థనలకు ప్రతిస్పందనగా సీబీఎస్ ఈ  ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామినేషన్ బైలాస్ లోని అద్యాయం 7 లోని సబ్ సెక్షన్ 40.1(iii)  ప్రకారం.. CBSE విద్యార్థులకు  no aggregate segregation, differentiation or aggregation ఇవ్వరాదని పేర్కొంది. 

అంతకుముందు సీబీఎస్ ఈ మెరిట్ జాబితాను విడుదల చేసే పద్దతిని తొలగించింది.. తాజా మార్కుల శాతం, గ్రేడ్ లు ఇవ్వబోమని తెలిపింది.