న్యూఢిల్లీ: న్యూస్ కంటెంట్ రెవెన్యూ పంపకం విషయంలో సక్రమంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలపై గూగుల్ మీద మరో దఫా కాంపిటీషన్ కమిషన్ దర్యాప్తుకు ఆదేశించింది. ఇప్పటికే గూగుల్పై నడుస్తున్న రెండు కేసులతో కలిపి తాజా కేసునూ దర్యాప్తు చేయనున్నట్లు కాంపిటీషన్ కమిషన్ వెల్లడించింది. న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ దాఖలు చేసిన కంప్లెయింట్ ఆధారంగా తాజా దర్యాప్తుకు సీసీఐ ఆదేశాలిచ్చింది.
ఈ ఏడాది జనవరి నెలలో డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఫైల్ చేసిన కంప్లెయింట్పై అప్పట్లో దర్యాప్తుకు ఆదేశించింది. ఆ తర్వాత ఇలాంటి కేసునే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ దాఖలు చేసింది. ఈ కేసులన్నింటినీ దర్యాప్తు చేసి తమ డైరెక్టర్ జనరల్ రిపోర్టు సబ్మిట్ చేయనున్నట్లు కాంపిటీషన్ కమిషన్తాజాగా ప్రకటించింది. సరయిన రెమ్యూనరేషన్ చెల్లించకుండానే న్యూస్ కంటెంట్ను పొందుతోందని గూగుల్పై బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ ఆరోపణలు చేస్తోంది.