సెలబ్రేటింగ్.. ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్

సెలబ్రేటింగ్.. ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్

డైరెక్టర్ శేఖర్‌‌ కమ్ముల సినీ ఇండస్ట్రీకి వచ్చి  25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్‌‌ కమ్ముల. ఈ నేపథ్యంలో  ‘25 ఇయర్స్ ఆఫ్  శేఖర్‌‌ కమ్ముల.. సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్’ పోస్టర్‌‌‌‌ని చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శేఖర్ కమ్ముల ‘‘టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను.

'ఈయనతో సినిమా తీయాలి' అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ . ఈ సందర్భంగా కొన్ని జనరేషన్స్‌‌ను ఇన్‌‌స్పైర్ చేసిన చిరంజీవి గారిని కలవాలని అనిపించింది. ఈ మూమెంట్‌‌లోనే కాదు,  నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు.’  అని శేఖర్‌‌ కమ్ముల పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన.. ధనుష్‌‌, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జూన్ 20న విడుదల కానుంది.