ఓటేసిన గంగూలీ.. లాస్ట్ ఫేజ్ పోలింగ్ లో ముఖ్య నేతలు

ఓటేసిన గంగూలీ.. లాస్ట్ ఫేజ్ పోలింగ్ లో ముఖ్య నేతలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలామంది ఓటేశారు. ఓటరు చైతన్యం చూపించారు.

కోల్ కతాలో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఓటేశారు. బరిష్టా జన కల్యాణ్ విద్యాపీఠ్ లోని పోలింగ్ సెంటర్ లో టీమిండియా మాజీ కెప్టెన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

వారణాసిలో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఓటేశారు.

పటియాలా 89 నంబర్ పోలింగ్ బూత్ లో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తన ఓటు హక్కు ఉపయోగించారు. రాష్ట్రంలోని పోలింగ్ సెంటర్లలో ఎన్నికలు ప్రశాంతంగా పూర్తిచేశామన్నారు.

పట్నాలోని కదమ్ కువాన్ .. 339 సెయింట్ సెవరీన్ స్కూల్ పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ అభ్యర్థి శతృఘన్ సిన్హా ఓటేశారు.