- ఐటీ ట్యాక్స్ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం
ఢిల్లీ: హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. హౌజ్ రెంటల్ అలవెన్స్ (హెచ్ఎస్ఏ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఇన్ కమ్యాక్స్ నిబంధనలు, 2026ను కేంద్రం నోటిఫై చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
గతంలో ముంబై, కోల్ కతా, ఢిల్లీ, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఆయా నగరాల్లో హెచ్ఎస్ఏ మినహాయింపు పరిమితి 50 శాతంగా ఉండేది. తాజాగా ఈ జాబితాలోకి హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ ను కూడా చేర్చారు.
అంటే 8 నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్ఎస్ఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు.మిగిలిన వారికి యథాతథంగా 40శాతం కొనసాగుతుంది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేయబోయే రిటర్న్ ల సమయంలో ఇది వర్తిస్తుంది.
