
శామీర్ పేట, వెలుగు: విల్లా డెవలప్ చేసేందుకు భూమి ఇచ్చిన వ్యక్తిని బెదిరించిన సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్, మేనేజర్ను శామీర్ పేట పోలీసులు అరెస్ట్చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్పేటలోని సెలబ్రిటీ రిసార్ట్ ఓనర్ విజయసేనారెడ్డి(69)కి అదే ఏరియాలో విల్లా డెవలప్మెంట్ కోసం జయఈశ్వర్ అనే వ్యక్తి, అతడి కుటుంబసభ్యులు వారి భూమిని ఇచ్చారు. అప్పటి నుంచి రిసార్ట్ ఓనర్ విజయసేనారెడ్డి, మేనేజర్ హరిజోసెఫ్(49) ఇద్దరూ కలిసి జయ ఈశ్వర్ రెడ్డిని, వారి కుటుంబసభ్యులను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో బాధితులు శామీర్ పేట పీఎస్ లో కంప్లయింట్ చేయగా.. పోలీసులు గురువారం ఆ ఇద్దరిని రిమాండ్కు తరలించారు