వ్యూహం సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. కథా, పాత్రలపై అభ్యంతరాలు

వ్యూహం సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డు.. కథా, పాత్రలపై అభ్యంతరాలు

క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram gopal varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం(Vyooham). దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajashekhara reddy) మరణాంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఆర్జీవీ. వ్యూహం,శపధం(Shapadam) అనే భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం వ్యూహం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు ఆర్జీవీ. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తాజాగా ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించారు  మేకర్స్. అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. కారణం.. సినిమాలో తీసుకున్న కంటెంట్ ప్రస్తుతం జరుగుతున్న అంశాలతో కూడుకున్నది కావడం, చిత్రంలోని పాత్రలకు నిజజీవిత పేర్లు పెట్టడంపై బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ కారణంగా వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది బోర్డు. ఇక సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై వ్యూహం మేకర్స్ స్పదించారు. ఈ అంశంపై ఇప్పటికే రీవైజింగ్ అప్లై చేశామని వివరించారు. మరి రివైజింగ్ అప్లికేషన్ పై రిప్లై ఎలా ఉండనుంది. వ్యూహం అనుకున్న డేట్ కు థియేటర్స్ లోకి వస్తుందా, లేక ఓటీటీ డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ :- భక్త కన్నప్పలో కామెడీ కింగ్స్.. ఫొటోస్ వైరల్