రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..

రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కేంద్రం, ఏపీ  ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా..

ఏపీలోని విజయనగరం జిల్లాలో నిన్న (అక్టోబర్ 29) జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాదంలో 32 మందికి గాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాకు కేంద్రప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. 

ఏపీ లో ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది. 

Also read :- కామెంట్లు పెట్టి, షేర్ చేస్తే..రూ. 1,500

విజయనగరం సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల చొప్పున  సాయం అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.