మహిళా బిల్లుపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : మహేశ్​ కుమార్​ గౌడ్​

మహిళా బిల్లుపై  కేంద్రానికి చిత్తశుద్ధి లేదు : మహేశ్​ కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్ ​కుమార్ ​గౌడ్​ఆరోపించారు. ఎప్పుడు అమలు చేస్తారో  తెలియని బిల్లును హడావుడిగా ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. త్వరలో రానున్న ఎన్నికలకు మహిళా బిల్లును అమలు చేస్తేనే బీజేపీ చిత్తశుద్ధి బయటపడుతుందన్నారు.

బిల్లులో  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన కోటా లేదని, అందుకే రాహుల్​ గాంధీ బీసీల అంశాన్ని లేవనెత్తారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని 90 సెక్రటరీల్లో  కేవలం ముగ్గురే బీసీలున్నారని ఆరోపించారు. కాంగ్రెస్​ బీసీ కులగణనకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన​ఆరు గ్యారెంటీలపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతున్నదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే హామీలను అమలు చేస్తామని తెలిపారు.