రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు

రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుంది : మంత్రి హరీష్ రావు

మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి  వచ్చే రూ.30 వేల కోట్లను కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. పక్కనే ఉన్న ఏపీ రాష్ట్రం మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకుందని వ్యాఖ్యానించారు. రూ.1350 కోట్ల వెనుకబడిన జిల్లాల నిధిని కేంద్రం ఆపిందని విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన రూ.24 వేల కోట్లను ఇవ్వలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా రూ.1300 కోట్లు కేంద్రం ఇవ్వలేదంటూ మండిపడ్డారు.

రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే కేంద్రం డబ్బులు వాపస్ కట్టించుకుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదని అదనంగా యూనిట్ కి రూ.20 ఇచ్చి విద్యుత్ కోసం నెలకు రూ.1500 కోట్లు చెల్లించి విద్యుత్ తీసుకుంటున్నామన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ అని ఆయన నొక్కి చెప్పారు.