
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా ప్రక్రియలో భాగంగా ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎఫ్జీఐఎల్ఐసీఎల్)లో 25.18 శాతం వాటాను రూ. 57 కోట్లకు కొన్నామని తెలిపింది. దీంతో బీమా రంగంలోకి ప్రవేశించామని పేర్కొంది. ప్రస్తుతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎఫ్జీఐఎల్ఐసీఎల్లో 25.28 శాతం వాటా ఉంది. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,810.53 కోట్ల స్థూల రాతపూర్వక ప్రీమియంను సంపాదించింది.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టెన్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ఫర్ కార్పొరేట్ పర్సన్స్) రెగ్యులేషన్స్, 2016 ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన బిడ్ ద్వారా ఎఫ్జీఐఎల్ఐసీఎల్లో 25.18 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడాన్ని సీసీఐ కూడా ఆమోదించింది. గత సంవత్సరం ఆగస్టులో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఎఫ్ఈఎల్) జీవిత సాధారణ బీమా వెంచర్లలో వాటా కొనుగోలుకు విజయవంతమైన బిడ్డర్గా నిలిచింది.