పాలమూరు జిల్లాకు చేరుకున్న కేంద్ర బలగాలు

పాలమూరు జిల్లాకు చేరుకున్న కేంద్ర బలగాలు

పాలమూరు, వెలుగు: వచ్చే పార్లమెంట్  ఎన్నికల కోసం జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చినట్లు ఎస్పీ హర్షవర్ధన్  తెలిపారు. జిల్లా పోలీస్  కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బలగాలను సాదరంగా ఆహ్వానించి ఈసీఐ గైడ్​లైన్స్  ప్రకారం నిర్వహించాల్సిన విధులను వివరించారు. ప్రజల్లో నమ్మకం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.  ట్రైనీ ఐపీఎస్  చిత్తరంజన్, ఏఆర్  అడిషనల్  ఎస్పీ సురేశ్ కుమార్  పాల్గొన్నారు.