బోధన్​లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బోధన్​లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

బోధన్, వెలుగు: బోధన్ లోని అంబేద్కర్​ చౌరస్తా వద్ద సీపీఐ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. డివిజన్​ కార్యదర్శి బి.మల్లేశ్​ మాట్లడుతూ కేంద్రం ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటలకు ఎంఎస్ పీ (మినిమం సపోర్ట్ ప్రైజ్) చట్టం చేయాలని డిమాండ్​ చేశారు. 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై టియర్ ​గ్యాస్ ​ప్రయోగం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా రైతుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. లీడర్లు పడాల శంకర్, జీ.సీతారాం, ఖాజామియా, శంకర్, బాలు, మొనాజీ పాల్గొన్నారు.