హైదరాబాద్, వెలుగు: కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. డెడ్బాడీలను శ్మశానాలకు తరలించడం, అంత్యక్రియలు చేయడం ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది స్పష్టం చేసింది. డెడ్బాడీల నుంచి వైరస్ ఇతరులకు సోకుండా ఉండేందుకు ఈ గైడ్లైన్స్ను కచ్చితంగా అమలు చేయాలని సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
- డెడ్బాడీలను తరలించేటప్పుడు హెల్త్ వర్కర్లకు ఇన్ఫెక్షన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెడ్బాడీని పరిశీలించేటప్పుడు హెల్త్ స్టాఫ్ తడి అంటుకోకుండా చూసుకోవాలి. యాప్రాన్, గ్లోవ్స్, మాస్క్లు కచ్చితంగా వాడాలి.
- కరోనా పేషెంట్చికిత్స కోసం ఏర్పాటు చేసిన ట్యూబులు, డ్రైన్లు వంటి అన్ని హెల్త్ టూల్స్ను తీసేయాలి.
- డెడ్బాడీ నుంచి ఎలాంటి ద్రవాలు రాకుండా.. నోరు, ముక్కు రంధ్రాలను మూసేయాలి. డెడ్బాడీని లీక్-ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టాలి. ఆ బ్యాగుపై హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి. రోగి కోసం వాడిన వస్త్రాలన్నింటినీ బయోహజార్డ్ బ్యాగ్లో ఉంచాలి.
- వ్యక్తి చనిపోయిన రూంలో ఫ్లోర్, మంచం, టేబుల్ సహా అన్నింటిపైనా సోడియం హైపోక్లోరైట్ స్ర్పే చేయాలి.
- డెడ్బాడీలను 4 డిగ్రీల సెల్సియస్ కోల్డ్ చాంబర్స్లో పెట్టాలి. డెడ్బాడీ ఉన్న ప్రాంతాన్ని సోడియం హైపోక్లోరైట్ తో ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
- డెడ్బాడీని గదిలో నుంచి బయటికి తీసుకువచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా చూడాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- డెడ్బాడీని తరలించేటప్పుడు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తరచుగా సోడియం హైపోక్లోరైట్ తో క్లీన్ చేయాలి.
- ఐసోలేషన్ రూంలు, మార్చురీ, అంబులెన్స్, శ్మశానవాటికల్లో డెడ్బాడీలను ఎత్తేటప్పుడు, దించేటప్పుడు సిబ్బందికి ఇన్ఫెక్షన్ రాకుండా ఏం చేయాలనే దానిపై ముందుగానే ట్రైనింగ్ ఇవ్వాలి.
- డెడ్బాడీకి వెంటనే అంత్యక్రియలు పూర్తి చేయాలి. – సాధ్యమైనంత వరకూ శవపరీక్ష లేకుండా చూడాలి. తప్పనిసరైతే డాక్టర్లు తగుజాగ్రత్తలు పాటించాలి.
- పోస్టుమార్టం అవసరమైతే ఆ రూంలోకి వీలైనంత తక్కువ మంది ఫోరెన్సిక్, ఇతర స్టాఫ్ను అనుమతించాలి. ఫోరెన్సిక్ నిపుణులు, సపోర్టింగ్ స్టాఫ్ కచ్చితంగా పీపీఈ కోట్లు, ఎన్95 మాస్క్లు, కళ్లద్దాలు వేసుకోవాలి.
- పోస్టుమార్టం చేసేటప్పుడు రౌండ్ ఎండెడ్ కత్తెరలనే వాడాలి. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే డెడ్ బాడీని సోడియం హైపోక్లోరైట్తో శుభ్రంచేసి లీక్-ప్రూఫ్ ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టాలి.
- ఎలాంటి అంతిమయాత్ర లేకుండా నేరుగా శ్మశానవాటికకు డెడ్బాడీని తీసుకుపోవాలి. ఎక్కువ మంది గుమికూడవద్దు. సమీప కుటుంబ సభ్యులు కొందరు వచ్చినా కచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి.
- అంత్యక్రియల సమయంలో డెడ్ బాడీ ఉన్న బ్యాగ్ను తెరిచి దూరం నుంచి బంధువులు, స్నేహితులు ఆఖరిసారి చూడడానికి అనుమతించొచ్చు.
- డెడ్బాడీని ముట్టుకోకుండా మతపరమైన అంత్యక్రియలన్నీ కొనసాగించవచ్చు. వీలైనంత దూరంగా ఉండి ఇవన్నీ చేసుకోవాలి.
- మృతదేహానికి స్నానం చేయించడం, తాకడం, ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం లాంటివి చేయకూడదు.
- అంత్యక్రియల తర్వాత చితాభస్మం నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు. దీన్ని బంధువులు తీసుకోవచ్చు.