- అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: స్కృతి ఇరానీ
అమేథీ: కేంద్ర మంత్రి, అమేథీ బీజేపీ లోక్ సభ అభ్యర్థి స్కృతి ఇరానీ.. కాంగ్రెస్అగ్రనేత రాహుల్గాంధీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ నెల 26 తర్వాత రాహుల్గాంధీ అమేథీకి వస్తారని.. ప్రజలను కులవివక్ష పేరుతో విభజిస్తారని ఆమె ఆరోపించారు. అలాగే, అమేథీలోని ఆలయాలను ఒకదాని తర్వాత ఒకటి సందర్శిస్తారని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారం అమేథీ పార్లమెంట్ సెగ్మెంట్లోని భేతువా, భాదర్ ఏరియాల్లో రోడ్షోలలో పాల్గొని మాట్లాడారు.అమేథీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.