ఆదాయ పంపిణీ సర్వే కోసం ప్యానెల్.. ఎంఓఎస్పీఐ ప్రకటన

ఆదాయ పంపిణీ సర్వే కోసం ప్యానెల్.. ఎంఓఎస్పీఐ ప్రకటన

న్యూఢిల్లీ: ఆదాయ పంపిణీ సర్వేపై సలహా ఇవ్వడానికి ఎకనమిస్ట్​ సుర్జిత్  భల్లా అధ్యక్షతన ఎక్స్​పర్ట్​ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్​పీఐ) సోమవారం ప్రకటించింది. 2026 కోసం తాత్కాలికంగా షెడ్యూల్ చేసిన అఖిల భారత ఆదాయ పంపిణీ సర్వేను నిర్వహించడంపై టెక్నికల్​ ఎక్స్​పర్టుల గ్రూప్​ (టీఈజీ) జాతీయ గణాంకాల కార్యాలయాన్ని గైడ్​ చేస్తుందని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఐఎంఎఫ్​ ఉన్నతాధికారి సుర్జిత్  భల్లా అధ్యక్షతన ఎంఓఎస్​పీఐ ఒక టీఈజీని ఏర్పాటు చేసింది.  సర్వే పద్ధతి,  సాధనాలు, నమూనాల తయారీ, అంచనా పద్ధతి,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను చేర్చడం వంటి వాటి విషయాల్లో సలహాలు సూచనలను అందిస్తుంది.

సర్వే ఫలితాలను ఖరారు చేయడానికి,  విడుదల చేయడానికి టీఈజీ సహకారం అందిస్తుంది. ఎంఓఎస్​పీఐతోపాటు  ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాల నుంచి ఛైర్మన్  అనేక మంది అధికారులు, కోల్‌‌‌‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ మాజీ ప్రొఫెసర్ అలోక్ కర్, ఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, జేఎన్​యూలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ శ్రీజిత్ మిశ్రా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తీర్థంకర్ పట్నాయక్,  పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ శుక్లా,  ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ రామ్ సింగ్ టీఈజీలో సభ్యులుగా ఉంటాయి.