
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్మునిసిపాలిటీ రాగన్నగూడలో చైన్స్నాచింగ్ జరిగింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. రాగన్నగూడలో నివాసముండే వృద్ధురాలు దశరథి చెన్నమ్మ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఎన్టీఆర్ నగర్లోని కూరగాయల మార్కెట్కు బయలుదేరింది. రాగన్నగూడా సబ్ స్టేషన్ సమీపంలో వెనుక నుంచి నడుచుకుంటూ వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు లాక్కొని పక్కనే ఉన్న తోటలోకి పారిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.