ముషీరాబాద్, వెలుగు: నిజాం నిరంకుశ పాలనపై, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గానుగపాటి సూర్యనారాయణ శర్మ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగామంగళవారం లోయర్ ట్యాంక్బండ్లోని ఆమె విగ్రహానికి బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేశ్ గౌడ్తో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన త్యాగశీలి ఐలమ్మ అని కొనియాడారు. దొరల గడీలను గడగడలాడించి వీరవనితగా చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. తెలంగాణ మహిళా లోకానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.