దొరల పాలనపై బరిగీసి .. కొట్లాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ

దొరల పాలనపై బరిగీసి .. కొట్లాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ

ముషీరాబాద్, వెలుగు: నిజాం నిరంకుశ పాలనపై, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గానుగపాటి సూర్యనారాయణ శర్మ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగామంగళవారం లోయర్ ట్యాంక్​బండ్​లోని ఆమె విగ్రహానికి బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ రమేశ్ గౌడ్​తో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.  

ఈ సందర్భంగా సూర్యనారాయణ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన త్యాగశీలి ఐలమ్మ అని కొనియాడారు. దొరల గడీలను గడగడలాడించి వీరవనితగా చరిత్రలో చెరగని ముద్ర వేసిందన్నారు. తెలంగాణ మహిళా లోకానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు.