షాకింగ్ వీడియో : ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తున్న డాక్టర్.. ఆటో ఎలా ఢీకొట్టిందో చూడండి

షాకింగ్ వీడియో : ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తున్న డాక్టర్.. ఆటో ఎలా ఢీకొట్టిందో చూడండి

చండీగఢ్లో దారుణ ఘటన జరిగింది. సెప్టెంబర్ 11వ తేదీన ఇద్దరు వ్యక్తులు సైకిల్ పై వెళ్తుండగా..వారిని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుల్లో ఒకరు 19 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.  వివరాల్లోకి వెళ్తే..

సెప్టెంబర్ 11వ తేదీన చండీగడ్ లో  ఉదయం డాక్టర్ లఖ్వీందర్ సింగ్, అతని సహోద్యోగి  మొహాలి నుంచి చండీగఢ్ కు  సైక్లింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో అతి వేగంగా వచ్చిన ఓ ఆటో..వీరిద్దరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో డాక్టర్ లఖ్వీందర్ సింగ్, అతని సహోద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే 19 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన డాక్టర్ లఖ్వీందర్ సింగ్ సెప్టెంబర్ 30వ తేదీన చనిపోయాడు. మృతుడు లఖ్వీందర్ సింగ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే లఖ్వీందర్ సింగ్ తో పాటు..అతని సహోద్యోగిని ఆటో ఢీకొట్టే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read :- బుల్లెట్ రైళ్ల తరహాలో.. వందే భారత్ రైళ్లలో క్లీనింగ్


ఈ ఏడాది జనవరిలోనూ చండీగఢ్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 25 ఏళ్ల తేజస్విత అనే  మహిళ తన ఇంటి ఆవరణలో వీధి కుక్కలకు ఆహారం అందిస్తుండగా..అతి వేగంగా వచ్చిన కారు..ఆమెను ఢీకొట్టింది. రాంగ్ సైడ్ నుంచి వచ్చిన కారు..మహిళను ఢీకొట్టడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. వీడియోను చూసిన నెటిజన్లు షాక్కు గురయ్యారు.