ఇండియా - పాక్ మ్యాచ్: 70 బిర్యానీలు ఆర్డర్ చేసిన కుటుంబం

ఇండియా - పాక్ మ్యాచ్: 70 బిర్యానీలు ఆర్డర్ చేసిన కుటుంబం

భారత్ వర్సెస్ పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్.. ఓ కుటుంబానికి బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నిరూపించింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 70బిర్యానీ ఆర్డర్లు చేశారు. ఈ విషయాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

"చండీగఢ్‌లో ఒక కుటుంబం ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది. IND vs PAKలో ఎవరు గెలుపొందుతారో వారికి ముందే తెలిసిపోయినట్టుంది" అంటూ ఎక్స్ లో స్విగ్గీ రాసుకువచ్చింది. దాంతో పాటు ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ లు బిర్యానీ తినే ఫొటోను షేర్ చేసింది. ఇదే తరహాలో సెప్టెంబర్‌లో, ఇండియా, పాక్ మధ్య జరిగిన పల్లెకెలె ఆసియా కప్ గేమ్‌లో బెంగళూరు నివాసి 62 బిర్యానీల కోసం ఆర్డర్ ఇచ్చాడు.

దాంతో పాటు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ప్రతి నిమిషానికి 250 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ నివేదించింది. స్విగ్గీ చేసిన ఈ ట్వీట్లకు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బిజినెస్ మీన్స్ బిజినెస్ అంటూ కొందరు కామెంట్ చేయగా.. 86 వడపావ్ లను ఆర్డర్ చేస్తే చాలా త్వరగా డెలివరీ చేశారు.. థ్యాంక్యూ స్విగ్గీ అంటూ ఓ యూజర్ అన్నారు. మరొకరేమో "ఈ రోజు భారత్ గెలిస్తే నాకు ఉచిత ఆర్డర్ కూపన్ ఇవ్వండి" అని కోరారు.