నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ ఈరోజుతో(అక్టోబర్ 19) ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే తన సెక్యూరిటీపై అనుమానాలు ఉన్నాయన్న చంద్రబాబు.. భద్రత, ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులను లేఖ ద్వారా తెలియజేయాలని జడ్జి కోరారు.

చంద్రబాబు అనుమానాలను లేఖ రూపంలో తనకు పంపాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు. చంద్రబాబు లేఖను సీల్ చేసి పంపించాలని కోరారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చిన చంద్రబాబు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తినని.. తనకు జైలు బయట, లోపల భద్రతా పరంగా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.