నేను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఉండదు: చంద్రబాబు

నేను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఉండదు: చంద్రబాబు

కాకినాడ: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు: కోడికత్తి పార్టీకి, కేసీఆర్, మోదీ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.  నేరస్తులకు మోదీ కాపలా కాస్తున్నారని విమర్శించారు. కాకినాడలో రోడ్ షో  నిర్వహించిన చంద్రబాబు మోదీని గుజరాత్ పంపించి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కేసీఆర్ ఏపీకి ద్రోహం చేస్తున్నారని..హైదరాబాద్ లోని ట్యాంకుబండ్ పై ఉన్న విగ్రహాలను కూల్చాడని అన్నారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్ అభివృద్ధి చేశామన్నారు. ఆంధ్రులను తిడితే ఖబడ్దార్ అని కేసీఆర్ ను హెచ్చరించారు చంద్రబాబు.  తాము వచ్చాక హైదరాబాద్ మసకబారిపోయిందన్నారు. తాను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఉండదన్నారు. ఏపీలో 20 హైదరాబాద్ లు నిర్మిస్తానన్నారు  పోలవరాన్ని అడ్డకోవడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. భద్రాచలం తమదే..రాముడిని తాము కాపాడుకుంటామన్నారు చంద్రబాబు.