
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మే 29 నుంచి టాటా కెమికల్స్ చైర్మన్, డైరెక్టర్ పదవుల నుంచి తప్పుకోనున్నానని చంద్రశేఖరన్ ప్రకటించారు. మే 28, 2025 తేదీతో రాసిన లేఖలో, చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని టాటా కెమికల్స్కు తెలియజేశారు. బుధవారం జరిగిన బోర్డ్ మీటింగ్లో ఈ అభ్యర్థనను ఆమోదించారని టాటా కెమికల్స్ స్టేట్మెంట్లో పేర్కొంది. “మే 29, 2025 నుంచి టాటా కెమికల్స్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో డైరెక్టర్, చైర్మన్ పదవుల నుంచి తప్పుకుంటున్నట్టు ఈ లేఖ ద్వారా తెలియజేశారు చంద్రశేఖరన్.
తన ప్రస్తుత, భవిష్యత్ కమిట్మెంట్స్ను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డ్కు చైర్మన్గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చంద్రశేఖరన్ తన లేఖలో పేర్కొన్నారు. మే 30, 2025 నుంచి కంపెనీ డైరెక్టర్ ఎస్. పద్మనాభన్ను బోర్డ్ చైర్మన్గా నియమించారు. అలాగే, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా, మోడన్ సాహాను మే 28, 2025 నుంచి అడిషనల్ డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించారు. సాహా ప్రస్తుతం టాటా సన్స్లో కొన్ని స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ను లీడ్ చేస్తున్నారని కంపెనీ తెలిపింది.