పోటీ నుంచి తప్పుకున్న చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి

పోటీ నుంచి తప్పుకున్న  చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి

హైదరాబాద్, వెలుగు :  పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థి ఊరడి సత్యనారాయణ ముదిరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి  ఆయన లేఖ రాశారు. మొదటి జాబితాలోనే సత్యనారాయణకు టికెట్ కేటాయించారు. వారం రోజుల కిందట ప్రచారం కూడా ప్రారంభించారు. అయిదు రోజుల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. విశ్రాంతి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు సూచించడంతో పోటీ నుంచి తప్పుకోవాలని సత్యనారాయణ నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది వెయిట్ చేయాల్సి ఉంది.