హీరో సూర్యతో చందూ మొండేటి.. జోనర్ తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే !

హీరో సూర్యతో చందూ మొండేటి.. జోనర్ తెలిస్తే మైండ్ బ్లాక్ అంతే !

డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti),హీరో నాగ చైతన్య(Naga Chaitanya)..కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసందే. ఈ మూవీ శ్రీకాకుళం నుండి గుజరాత్ కు వలస వెళ్లే మత్స్యకారుల కుటుంబాల నేపథ్యంలో స్టోరీ ఉంటుందని సమాచారం. తండేల్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ మూవీలో చైతు బోటు డ్రైవర్ పాత్రలో నటిస్తారని తెలుస్తోంది. 

ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం డైరెక్టర్ చందూ మొండేటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)తో మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ మైథాలజీకి కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ సబ్జెక్టును సూర్యకి చెప్పి ఒప్పించినట్లు టాక్. అంతేకాకుండా ఈ మూవీ ఫాంటసీ, సోషల్ థీమ్స్తో  బేస్ చేసుకుని పురాణ వేదాల ఆధారంగా కాన్సెప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. 

డైరెక్టర్ చందు మొండేటి మైథాలజీ కాన్సెప్ట్స్ ను తెరకెక్కించడంలో సిద్దహస్తులు. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ తో తీసిన కార్తీకేయ1, కార్తీకేయ2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇక కార్తీకేయ-3 కూడా అదిరిపోయే మైథాలజీ కాన్సెప్ట్స్ తో, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో కథ రాసుకున్నట్టు సమాచారం.  

హీరో సూర్య కోలీవుడ్ తో పాటు,టాలీవుడ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. ఇక డైరెక్ట్ తెలుగు మూవీస్ చేయాలనీ ఉన్న, సరైన స్టోరీ లేకపోవడంతో ఇన్నాళ్లు తెలుగులో డైరెక్ట్ మూవీ చేయలేదని తెలుస్తోంది. ఇక చందూ మొండేటి మైథాలజీ స్క్రిప్ట్ కు, సూర్య ఒకే చెప్పినట్టు బలమైన టాక్ రావడంతో తెలుగు ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 

సూర్య ఇప్పుడు కంగువ అంటూ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శౌర్యం ఫేమ్ శివ డైరెక్ట్ చేస్తుండగా, స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు పాన్ ఇండియా లెవెల్లో దాదాపు పది భాషల్లో..త్రీడీలో రిలీజ్‌‌‌‌ కానుంది.