హైదరాబాద్: ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. దీంతో నిర్ణీత సమాయనుసారంగా చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు.. హైదరాబాద్ నుంచి చెన్నై తాంబారంకు బయలుదేరి వెళ్లింది. జనవరి 10వ తేదీ బుధవారం నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
మూడు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పట్టాలు తప్పిన మూడు కోచ్లను రైల్వే అధికారులు పునరుద్దరించారు.