డబ్బులు డ్రా చేయమని కార్డు ఇస్తే రూ. 1.73 లక్షలు కొట్టేశాడు

డబ్బులు డ్రా చేయమని కార్డు ఇస్తే  రూ. 1.73 లక్షలు కొట్టేశాడు

మేడ్చల్, వెలుగు:  మేడ్చల్ జిల్లా పూడూరుకు చెందిన పుణ్యవతి గత జనవరి 27న మేడ్చల్ టౌన్ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం వద్దకు వెళ్లింది. అక్కడ ఓ యువకుడికి డబ్బులు డ్రా చేయమని తన కార్డు ఇచ్చి పిన్ నంబర్ చెప్పింది. రూ.4వేలు డ్రా చేసి ఆమె ఏటీఎంకు బదులు మరో ఏటీఎం కార్డు ఇచ్చాడు. అనంతరం అతడు పుణ్యవతికి చెందిన ఏటీఎంతో కార్డుతో  రూ. 1.73 లక్షలను డ్రా చేశాడు. నాలుగు రోజుల కిందట డబ్బులు అవసరమైన ఆమె విత్ డ్రా కోసం బ్యాంకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవు. దీంతో లబోదిబోమంటూ పుణ్యవతి తన కొడుకు కిషోర్ తో  కలిసి సోమవారం మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.